Kerala | కేరళ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోజికోడ్ (Kozhikode) జిల్లా ఎలత్తూర్ ( Elathoor) సమీపంలో కదులుతున్న రైలు (Moving Train)లో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలప్పుళ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు ( Alappuzha-Kannur Executive Express train )లో ఆదివారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు కోజికోడ్ (Kozhikode) నగరం దాటి కోరపుజ రైల్వే వంతెన వద్ద (Korapuzha railway bridge)కు చేరుకోగానే డీ1 కంపార్ట్మెంట్లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే మంటలు తోటి ప్రయాణికులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన తర్వాత రైల్లో నుంచి ముగ్గురు ప్రయాణికులు కనిపించలేదని తోటివారు గుర్తించారు. వారి కోసం గాలింపు చేపట్టగా ఘటన జరిగిన సుమారు 100 మీటర్ల దూరంలోని రైల్వే ట్రాక్పై వారి మృతదేహాలు కన్పించాయి. ఏడాది చిన్నారి సహా, ఒక మహిళ, ఓ పురుషుడి మృతదేహాలను ట్రాక్పై గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నారు.
Also Read..
Uddhav Thackeray | మోదీకి ఏ డిగ్రీ ఉంది? ఏ కాలేజీ నుంచి పట్టా పొందారు..? : ప్రశ్నించిన ఉద్ధవ్
Rahul Gandhi | అనర్హత కేసులో నేడు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ
McDonalds | ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెక్డొనాల్డ్స్..!