Uddhav Thackeray | గత వారం రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi) డిగ్రీ సర్టిఫికెట్ (Degree Certificate) వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోదీ డిగ్రీ సర్టిఫికెట్ (Modi Degree Certificate) వివరాలు అడిగినందుకు గానూ ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi Cm) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) రూ. 25 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ విద్యార్హత పత్రాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే మోదీ సర్టిఫికెట్ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. తాజాగా ఇదే అంశంపై శివసేన చీఫ్ (Shiv Sena chief) , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) స్పందించారు. మోదీపై విమర్శలు గుప్పించారు. ‘దేశంలో ఎంతో మంది డిగ్రీ చదివిన యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మోదీని డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని అడిగినందుకు రూ.25వేలు ఫైన్ విధించారు. మోదీకి ఏ డిగ్రీ ఉంది..? ఏ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు..? ఏ కళాశాల అయినా తన విద్యార్థి దేశానికి ప్రధాని అయితే గర్వపడుతుంది. ప్రధాని తమ కాలేజీలోనే చదివారు అంటూ గొప్పగా చెప్పుకుంటుంది. అయితే మోదీ చదివిన కళాశాలకు ఆ గర్వం ఎందుకు కలగలేదు..?’ అంటూ ఉద్ధవ్ ప్రశ్నించారు.
Also Read..
Rahul Gandhi | అనర్హత కేసులో నేడు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ
McDonalds | ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెక్డొనాల్డ్స్..!
Janhvi Kapoor | శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్