తిరుమల: దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor) తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateshwara swamy) దర్శించుకున్నది. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న జాన్వీ.. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
జాన్వీకపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (NTR) సరసన నటిస్తున్నది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమా ‘ఎన్టీఆర్30’ (NTR30) షూటింగ్ మార్చి 31 ప్రారంభమయింది. ఎన్టీఆర్, జాన్వీకపూర్పై తీసిన తొలిషాట్కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్లాప్కొట్టారు. జాన్వీకి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ని ఇప్పటికే షేర్ చేసింది. అతిలోకసుందరి శ్రీదేవి పెద్దకూతురు నటిస్తున్న మొదటి తెలుగు సినిమా అయిన ‘ఎన్టీఆర్30’ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్నది.
#WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/nYxZq7NA2A
— ANI (@ANI) April 3, 2023
Janhvi Kapoor | జాన్వీ కపూర్ ప్రేమాయణానికి పెద్దల గ్రీన్ సిగ్నల్!