Karnataka | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శివమొగ్గ (Shivamogga) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి (government hospital) ప్రసూతి వార్డు (maternity ward) సమీపంలో నవజాత శిశువు (newborn Baby) మృతదేహాన్ని ఓ వీధి కుక్క (Stray Dog) నోటితో ఈడ్చుకెళ్లింది.
శనివారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఓ వీధి కుక్క నవజాత శిశువును నోటకరిపించుకొని ప్రసూతి వార్డు చుట్టూ తిరగటాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది దాన్ని తరిమికొట్టారు. దీంతో కుక్క చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయింది. కుక్క నోటి నుంచి వదిలిన శిశువును వైద్యులు పరిశీలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తేలింది.
వీధికుక్క బారినపడి నవజాత శిశువు చనిపోయిందా, లేక చిన్నారి ముందే చనిపోయిందా అన్నదానిపై వైద్యులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోస్టుమార్టం తర్వాతే శిశువు మృతికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులు చెప్పారు. నవజాత శిశువు సమాచారం కోసం ప్రసూతి వార్డును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పోస్టుమార్టం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు తెలిపారు. శిశువు తల్లిదండ్రులు ఎవరో కూడా ఇంకా తెలియరాలేదు. వారి ఆచూకీ కోసం ఇప్పటికే అధికారులు సమీప ఆసుపత్రుల్లో ప్రసవానికి వచ్చిన మహిళల వివరాలు సేకరిస్తున్నారు.
Also Read..
Indore Temple | మెట్లబావి కూలిన ఘటన.. ఇండోర్ ఆలయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
Kerala | దారుణం.. తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్పోసి నిప్పంటించిన వ్యక్తి.. ముగ్గురు మృతి
Uddhav Thackeray | మోదీకి ఏ డిగ్రీ ఉంది? ఏ కాలేజీ నుంచి పట్టా పొందారు..? : ప్రశ్నించిన ఉద్ధవ్