Indore Temple | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని ఇండోర్లో (Indore) శ్రీరామనవమి (Ram Navami) వేడుకల సందర్భంగా మెట్లబావి (Step Well) పైకప్పు కూలి 36 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కబ్జా చేసిన స్థలంలో ఆలయం కట్టారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.
కాగా, ఈ ఘటనపై తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం ఉదయమే అధికారులు బుల్డోజర్లతో (Bulldozer) ఆలయానికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలు పెట్టారు. పనులను ఇండోర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్తోపాటు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
కాగా, ఆలయంలో అక్రమ నిర్మాణాలపై గతంలోనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. అయితే, ఆలయంలో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే భక్తులు మనోభావాలను దెబ్బతీసినట్లవుతుందని ఆలయ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలో వెనక్కి తగ్గారు. తాజా ఘటనతో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు ముందుకొచ్చారు.
#WATCH | Madhya Pradesh: Indore municipality deploys bulldozer & demolishes illegal structure at Indore temple where 36 people died after the stepwell collapse there last week. pic.twitter.com/gpRJB6zWhN
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 3, 2023
Also Read..
Rahul Gandhi | అనర్హత కేసులో నేడు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ
Kerala | దారుణం.. తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్పోసి నిప్పంటించిన వ్యక్తి.. ముగ్గురు మృతి
Uddhav Thackeray | మోదీకి ఏ డిగ్రీ ఉంది? ఏ కాలేజీ నుంచి పట్టా పొందారు..? : ప్రశ్నించిన ఉద్ధవ్