Pesticides | పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారం అందించే క్రమంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు నాశనుల వాడకం పెరిగింది. పంటల దిగుబడులు బాగా పెరిగి ఆహార భద్రత సమకూరినప్పటికీ, ఇలాంటి ఆహారం వల్ల ఎనిమిది రకాలైన ప్రమాదకర రసాయనాలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పంటలు, కూరగాయలు, పండ్లతోటల్లో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు మోనోక్రోటోఫాస్, ఆక్సిడెమెటాన్మిథైల్, ఏసిఫేట్, ప్రొఫెనోఫాస్, ఎలక్లార్, క్లోరోథాలోనిల్, మిథోమైల్, ైగ్లెఫోసేట్ లాంటి క్రిమి సంహారకాలు, శిలీంధ్ర నాశకాలు, కలుపు నాశనులను పిచికారీ చేస్తారు. వీటిలో ఉండే హానికరమైన రసాయనాల వల్ల శ్వాస సమస్యలు, నాడీకణాలు ధ్వంసం కావడం, చర్మ సమస్యలు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు, క్యాన్సర్లు అభివృద్ధి చెందడంలాంటి విపరిణామాలు సంభవిస్తాయి.
కాబట్టి, మన ఆరోగ్య సంరక్షణ కోసం తినే ఆహార పదార్థాల్లో దాగి ఉన్న ఈ రసాయనాల గురించి తెలుసుకుని ఉండాలి. మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవడం, పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినడం, సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించడం మొదలైన చర్యల ద్వారా హానికరమైన రసాయనాల ప్రభావాన్ని తప్పించుకోవచ్చు.