UNESCO | ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్ (India)లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథ్పురాలోని ‘హోయసల’ (Hoysala) దేవాలయాలను ప్రపంచ వారసత్వ కట్టడాల (World Heritage Sites) జాబితాలోకి చేర్చినట్లు యునెస్కో (UNESCO) తాజాగా వెల్లడించింది. సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్లోని ‘శాంతినికేతన్’ని వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది.
హోయసల పవిత్ర ఆలయాలు 2014 ఏప్రిల్ 15 నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. 13వ శతాబ్ధపు వాస్తుశిల్ప కళను కలిగిన హోయసల బేలూర్లోని చెన్నకేశ ఆలయం, హళీబేడు లోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయం యునెస్కో వారసత్వ ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. కాగా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ దేశాల తరువాత అత్యధిక యునెస్కో వారసత్వ ప్రాంతాలు కలిగిన ఆరో పెద్ద దేశంగా ఇండియా నిలిచింది.
Also Read..
Parliament | 96 ఏండ్ల ఘనచరిత్రకు వీడ్కోలు.. నేటి నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు
Vijay Antony | బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య
Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర.. ఆరోపించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో