Coronavirus | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మరోసారి కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా కొవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో సోమవారం 260 కేసులు నమోదు కాగా, మంగళవారం 142 కేసులు బయటపడ్డాయి. ఆ సంఖ్య బుధవారంనాటికి 300 మార్క్ను దాటింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 341 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో అధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 24 గంటల వ్యవధిలో 292 మందికి పాజిటివ్గా తేలింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కి పెరిగింది.
మరోవైపు కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు. అందులో ఒకటి కర్ణాటకలో కాగా, రెండు మరణాలు కేరళలో నమోదయ్యాయి. దీంతో కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా ఈ మూడేళ్లలో మహమ్మారికి 3,33,321 మంది బలయ్యారు. కరోనా నుంచి 4.44 కోట్ల మంది రికవరీ కాగా, రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంకాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read..
Heavy Rains | 47 ఏళ్లలో లేనివిధంగా కుండపోత వర్షంతో అతలాకుతలమైన తమిళనాడు.. 10 మంది మృతి
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. జగన్పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేశ్
DGP Ravi Gupta | డ్రగ్స్ పెడ్లర్లకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా వార్నింగ్