AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీ నాయకులకు గుబులు పుడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్చాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కసరత్తు చేస్తుండటంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఎవరికి సీటు ఇస్తారో.. ఎవరికి ఇవ్వారననే ఆందోళన పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నిన్న ఏపీ పర్యాటక మంత్రి రోజా సెల్వమణి స్పందించగా.. తాజాగా మంత్రి జోగి రమేశ్ కూడా రియాక్ట్ అయ్యారు. జోగి రమేశ్ సమర్థుడైతేనే టికెట్ ఇస్తారని.. లేదంటే ఇవ్వరని పేర్కొన్నారు.
జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. గీత దాటనని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. పెడనలో పోటీ చేయమంటే చేస్తా.. మైలవరం వెళ్లమంటే వెళ్తానని పేర్కొన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి రోజా కూడా దాదాపు ఇదేవిధంగా స్పందించారు. నగరి నియోజకవర్గం నుంచి సీటు రావడం లేదన్న వ్యాఖ్యలపై స్పందించారు. ‘తనకు సీటు ఇవ్వకపోయిన ఇబ్బందేమి లేదు. తాను జగనన్న సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణాలైన ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పా. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదని’ పేర్కొన్నారు. తనకు సీటు ఉందో లేదో నన్న విషయం కార్యకర్తలకు, నాయకులకు తెలుసునని వెల్లడించారు. తనకు సీటు లేదని మీరు(మీడియా) ఆనందపడినా ఇబ్బంది ఏమీ లేదని అన్నారు.