న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆదివారం ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మెగా ర్యాలీని నిర్వహించాయి. ర్యాలీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ భార్య కల్పనా సోరెన్తో కలిసి హాజరయ్యారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్కు సంఘీభావంగా చేపట్టిన ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో భాగస్వామ్య పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్లో ఈ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితులు పాల్గొన్నారు. విపక్ష నేతలను అరెస్ట్ చేస్తూ పాలక బీజేపీ ప్రజాస్వామ్యానికి పాతరేస్తోందని నేతలు మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
మార్చి 21 తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, సిట్టింగ్ సీఎంను ఎందుకు అరెస్ట్ చేశారో ఎవరికీ అర్ధం కాలేదని ఆప్ మంత్రి గోపాల్ రాయ్ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసే ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ను అరెస్ట్ చేశారని, ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ మోదీ సర్కార్ ప్రజాస్వామ్యంపై దాడికి తెగబడుతోందని దుయ్యబట్టారు.
Read More :
Krishna Express | విరిగిన రైలు పట్టా.. కృష్ణా ఎక్స్ ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం