యాదాద్రి భువనగిరి : కృష్ణా ఎక్స్ ప్రెస్కు(Krishna Express) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆలేరు(Aleru) రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే స్పందించిన అధికారులు ఆలేరులో రైలును ఆపిన అధికారులు విరిగిన పట్టాకు మరమ్మతులు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.