రాంచీ : జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. రోప్ వే క్యాబిన్లలో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
మంగళవారం ఉదయం 10 మందిని సైన్యం సురక్షితంగా కాపాడింది. ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులను ఆర్మీ హెలికాప్టర్ ద్వారా రక్షించారు. కేబుల్ కార్లలో మరో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు సైన్యం భావిస్తోంది. వారిని కూడా సురక్షితంగా తరలించేందుకు యత్నిస్తున్నట్లు ఐటీబీపీ జవాన్లు పేర్కొన్నారు.
దేవ్గఢ్లోని ప్రముఖ బైద్యనాథ్ దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 50 మంది ప్రయాణికులు 24 గంటల పాటు రోప్వే క్యాబిన్లలో చిక్కుకుపోయారు. ఎంఐ-17 హెలికాప్టర్ల ద్వారా 22 మందిని నిన్న రక్షించారు.
#WATCH | IAF recommenced rescue operations at Deoghar ropeway in Jharkhand, early this morning.
(Video source: IAF Twitter handle) pic.twitter.com/XstP7ESWAE
— ANI (@ANI) April 12, 2022