హైదరాబాద్ : కేంద్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి రాగానే కులగణన(Caste enumeration) చేపడుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అందుకే 400 కావాలని కోరుతున్నారు. దేశంలో 90 శాతం ప్రజల హక్కులు కాలరాసేందుకు బీజేపీ కుట్రపన్నుతున్నదని విమర్శించారు.
అయితే రిజర్వేషన్ల ద్వారానే ఎస్సీలు, గిరిజనులకు అవకాశాలు వచ్చాయన్నారు. దేశంలోని సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం ప్రజలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వనరులను అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇదే విషాయన్ని రాహుల్ గాంధీ చెప్పారని, గెలువగానే కులగణన చేపడుతామని స్పష్టం చేశారు.