హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బస్సు యాత్ర(KCR bus Yatra) కొనసాగుతున్నది. వరస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో స్పీడ్ను పెంచి పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపుతున్నారు. అందులో భాగంగా నేడు కామారెడ్డి(Kamareddy), మెదక్ జిల్లాల్లో(ఛాదలర) పర్యటించనున్నారు.
ముందుగా సాయంత్రం 5 గంటలకు కామారెడ్డిలోని జేపీ చౌక్ వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు బీఆర్ఎస్ కంచుకోట మెదక్లోని రాందాస్ కూడలిలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొంటారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం విదితమే. అధినేత బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది.