అహ్మాదాబాద్: గుజరాత్లోని అహ్మాదాబాద్లో అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ(Gautam Adani) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహమ్మద్పురా ప్రైమరీ స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్లో ఆయన ఓటేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 93 సీట్లకు మూడవ దశ లోక్సభ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటేసిన తర్వాత అదానీ రిపోర్టర్లతో మాట్లాడారు. తన ఫ్యామిలీతో కలిసి ఓటింగ్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఓటేయడం గర్వంగా ఉందన్నారు. ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్లో పాల్గొనాలని ఆయన కోరారు. భారత్ ప్రగతి దిశగా ముందుకు వెళ్తోందని, మరింత ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్షన్ రోజుకు ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో జరిగే అతిపెద్ద పండుగ ఇదే అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక ఓటు శక్తివంతమైందని ఆయన తన ట్వీట్లో తెలిపారు. భారత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఓటును వేయాలని ఆయన కోరారు.
Proud to have voted with my family today. Voting is a right, a privilege and a responsibility we all share as citizens of this great nation. Every vote is a powerful voice in our democracy. Cast your vote for shaping the future of India. Jai Hind. pic.twitter.com/nMAfAhQEdD
— Gautam Adani (@gautam_adani) May 7, 2024