Chiranjeevi | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని తెలిసిందే. త్వరలో ఏపీ అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తరపున పలువురు సినీ ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సోదరుడు పవన్ కల్యాణ్కు మద్దతు తెలియజేస్తూ.. ఓటర్లతో, ప్రత్యేకించి పిఠాపురం ప్రజలతో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.
కొణిదెల పవన్ కల్యాణ్.. అందరికి మంచి చేయాలి.. మేలు జరుగాలనే విషయంలో ముందువాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం పవన్ కల్యాణ్ది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు చేయడం, సరిహద్దు దగ్గర ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, మత్స్యకారులతోపాటు ఎంతోమంది తను సాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది.
పవన్ కల్యాణ్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు.. కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్లవల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని జనం కోసం జనసైనికుడయ్యాడు. ప్రజల కోసం, రాష్ట్రభవిష్యత్ కోసం పవన్ కల్యాణ్ అనే శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతడి గొంతు మనం వినాలి. జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్ను గెలిపించాలి.. అంటూ సందేశాన్ని పంచుకోగా నెట్టింట వైరల్ అవుతోంది.
జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024