కరోనా వలన దాదాపు మూడు నెలల పాటు షూటింగ్కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తిరిగి జరుపుకుంటున్నాయి. అయితే ఇటీవల బాలీవుడ్ హిట్ ‘అందాధున్’ తెలుగు రీమేక్ మ్యాస్ట్రో చివరి షెడ్యూల్ ప్రారంభం కాగా, తాజాగా ఆ షెడ్యూల్ పూర్తైందని మేకర్స్ ప్రకటించారు.
‘మ్యాస్ట్రో లో నితిన్ సరసన నభానటేశ్ నటిస్తుండగా.. తమన్నా కీలకపాత్రలో కనిపించనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా జరిగిన షెడ్యూల్లో నితిన్-తమన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నితిన్ రీసెంట్గా చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకులని అలరించగా ఈ రెండు చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి.