Meghalaya | మేఘాలయ (Meghalaya) రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ (Ernest Mawrie) కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ (Beef) మాసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. తాను కూడా గొడ్డు (Beef) మాంసం తింటా అని అన్నారు. బీఫ్పై కొన్ని బీజేపీ (Bjp) పాలిత రాష్ట్రాలు ఆంక్షలు తీసుకురాగా.. ఇప్పుడు ఎర్నెస్ట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానాలపై నేను ప్రకటన చేయలేను. మేము ఇప్పుడు మేఘాలయలో ఉన్నాము. ఇక్కడ అందరూ గొడ్డు (బీఫ్) మాంసం తింటారు. ఎలాంటి ఆంక్షలూ లేవు. అవును, నేను కూడా బీఫ్ తింటాను. మేఘాలయలో ఎలాంటి నిషేధం లేదు. ఇది ఇక్కడి ప్రజల జీవన శైలి (Life Style). ఎవరూ దీన్ని ఆపలేరు. దేశంలో కూడా అలాంటి నియమం లేదు. కొన్ని రాష్ట్రాలు చట్టాలను ఆమోదించాయి. మాకు ఓ కబేళా (Slaughterhouse) ఉంటుంది. అందరూ ఆవు లేదా పందిని మార్కెట్కు తీసుకొస్తారు. ఇక్కడి ప్రజలకు ఇది ఓ అలవాటు’ అని ఎర్నెస్ట్ (Ernest Mawrie) అన్నారు. ప్రస్తుతం అతను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Spinal Muscular Atrophy | చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చిన వ్యక్తి..!
Joe Biden | విమానం ఎక్కుతూ పడిపోబోయిన అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్..!
IAS Vs IPS | నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలి, క్షమాపణలు చెప్పాలి.. రూపకు రోహిణి నోటీసులు..!