తిరుపతి: తిరుపతి(Tirupati)లోని గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్క్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీ ప్రాంతంలో, ఇండ్ల మధ్య ఉన్న దుకాణంలో మంటలు రావడంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. గోవిందరాజస్వామి గుడి రథ మండపం వద్దకు మంటలు వ్యాపించాయి. మూడంతస్థుల భవనంలో ఎగసిపడుతున్న మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇరుకైన ప్రాంతంలో ఘటన జరగడంతో దూరం నుంచే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
#WATCH | A fire broke out in a photo frames manufacturing unit located in a building, in Tirupati, today; no casualties were reported#AndhraPradesh pic.twitter.com/GUDR7TE9YH
— ANI (@ANI) June 16, 2023
ఫోటో ఫ్రేమ్ దుకాణంలో దాదాపు 10 కోట్ల విలువైన ఫోటో ఫ్రేమ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు మరిన్ని షాపులకు వ్యాపిస్తున్నాయి. మహారథానికి కూడా నిప్పు అంటుకుంది. గోవిందరాజుకు చెందిన మహారథం తగలబడినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదంతో అలర్ట్ అయిన భక్తులు పరుగులు తీశారు. ఇటీవలే ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పూర్తయిన విషయం తెలిసిందే.