Himanta Biswa Sarma : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల నేపధ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాలయ ప్రారంభ వేడుకకు రాహుల్ గాంధీని ఎందుకు ఆహ్వానించలేదని ఓ విలేకరి ప్రశ్నకు అసోం సీఎం బదులిచ్చారు. మీరెందుకు రావణుడి గురించి మాట్లాడుతున్నారని సదరు విలేకరిని శర్మ ప్రశ్నించారు.
ఈరోజు రాముడి గురించి మాట్లాడాలని 500 ఏండ్ల తర్వాత ఇవాళ రాముడి గురించి మాట్లాడుకోవడం మంచిదని వ్యాఖ్యానించారు. కనీసం ఈరోజు రావణుడి గురించి మమ్మల్ని మాట్లాడనివ్వకండని అసోం సీఎం పేర్కొన్నారు. ఇక అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు రాహుల్ గాంధీని ఆహ్వానించలేదు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురిలకు ఆహ్వానాలు వెళ్లగా తాము ఈ కార్యక్రమానికి హాజరు కాబోమని వారు స్ప్టష్టం చేశారు. అయోధ్య కార్యక్రమం నరేంద్ర మోదీ కార్యక్రమమని, ఇది ఆరెస్సెస్, బీజేపీ కార్యక్రమమని కాంగ్రెస్ మొదటినుంచీ చెబుతోంది. రాజకీయ పార్టీ చేపట్టే ఈ కార్యక్రమానికి తాము హాజరుకావడం కష్టమని రాహుల్ గాంధీ సైతం వ్యాఖ్యానించారు.
Read More :