లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో (Ayodhya Ram Mandir ) ఎట్టకేలకు బాల రాముడు కొలువయ్యాడు. ఈ ఆలయ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో మరో ఏడాదిలో అయోధ్యకు ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి మించిన భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను ప్రతి ఏటా సుమారు 30-35 మిలియన్ (3-3.5 కోట్ల ) మంది సందర్శిస్తున్నారు. ఏపీలోని తిరుమల శ్రీవారిని ఏటా సుమారు 25-30 మిలియన్ల (2.5-3) కోట్ల మంది భక్తులు దర్శిస్తున్నారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ మతానికి ప్రసిద్ధి చెందిన వాటికన్ నగరంలో ప్రతి సంవత్సరం సుమారు 9 మిలియన్ల (90 లక్షల) మంది పర్యటిస్తున్నారు. ఇక ముస్లింలకు ఎంతో ప్రవిత్రమైన సౌదీ అరేబియాలోని మక్కాను ఏటా సుమారు 20 మిలియన్ల (2 కోట్లు) మంది సందర్శిస్తున్నారు.
మరోవైపు అయోధ్య మరింతగా అభివృద్ధి చెందితే ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందని బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. తద్వారా అయోధ్యలోని రామమందిరం ప్రతి ఏటా సుమారు 50 మిలియన్ల (5 కోట్ల) మందికిపైగా పర్యాటకులను ఆకర్షిస్తుందని ఆ సంస్థ నివేదిక హైలైట్ చేసింది.