(Double Vaccination) సిమ్లా : దేశంలో 100 శాతం కరోనా రెండు వ్యాక్సిన్లను అందజేసిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ప్రదేశ్ అవతరించింది. శనివారం నాటికి 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. రాష్ట్రంలోని 1,53,077 మందికి కొవిడ్ రెండు డోసులను అందజేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 6 నాటికి రాష్ట్రంలోని 55.77 లక్షల మందికి మొదటి డోస్ను అందించాలన్న లక్ష్యాన్ని హిమాచల్ప్రదేశ్ సాధించింది. అప్పటికే రాష్ట్రంలోని 17 శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందింది. సెప్టెంబరు 6 నుంచి డిసెంబరు 5 మధ్య కాలంలో 100 శాతం కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే లక్ష్యాన్ని సాధించారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కార్యచరణ కారణంగానే 100 శాతం వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తిచేయగలిగారని కేంద్ర మంత్రి మాండ్వ ప్రశంసించారు. ఈ మేరకు ఆదివారం బిలాస్పూర్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాగా, రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 78 మంది మాత్రమే కొవిడ్కు గురైనట్లు నివేదికలు చెప్తున్నాయి. రెండు రోజులుగా కొవిడ్తో రాష్ట్రంలో ఒక్కరు కూడా చనిపోలేదు. అయితే, శనివారం బిలాస్పూర్, చంబాలో ముగ్గురు కొత్త కరోనా రోగులను అధికారులు గుర్తించారు. అలాగే, హమీర్పూర్లో 7, కాంగ్రాలో 25, కిన్నైర్, కులు, ఎక్మండిలో ఒక్కొక్కరు చొప్పున, సిమ్లాలో 17 మంది, సలెన్, ఉనాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ కనిపించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,27,483కి పెరిగింది. ఇందులో కరీనాలో 800 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,831 మంది రోగులు కోలుకున్నారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..