Heavy Rains | తమిళనాడు ( Tamil Nadu) రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోయంబత్తూరు, తిరువూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండపోత వాన పడింది. నీల్గిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. మరోవైపు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది. తంజావూర్, తిరువారూర్, నాగపట్నం, మైలదుత్తురై, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, విరుదునగర్, తూత్తుకుడి, తెంకాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తిరువారూర్ జిల్లా, పుదుచ్చేరిలోని కారైక్కల్లోని పాఠశాలలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు (schools shut) అధికారులు ప్రకటించారు. వర్షం కారణంగా పలు రైళ్లను రద్దు (trains cancelled) చేశారు. నీలగిరి మౌంటైన్ రైల్వేలోని కల్లార్, కూనూర్ సెక్షన్ల మధ్య ట్రాక్పై కొండచరియలు, చెట్లు కూలిపడటంతో నవంబర్ 16 వరకు ఆ రూట్స్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మెట్టుపాళయం నుంచి ఉదగమండలం వరకు నడిచే 06136, 06137 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Delhi Rains: ఢిల్లీ వెదర్లో ఆకస్మిక మార్పు.. స్వల్ప వర్షంతో ఊరట
Chikungunya |ప్రపచంలోనే తొలిసారిగా చికున్గున్యా వైరస్కు వ్యాక్సిన్.. ఆమోదించిన అమెరికా
Daruvu Yellanna | ఇంతకాలం విమర్శించిన దరువు ఎల్లన్న.. బీఆర్ఎస్లోనే ఎందుకు చేరారు?