Gyanvapi | ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించి ఏఎస్ఐ ( ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానవాపి మసీదు కింద అతి పెద్ద ఆలయం ఆనవాళ్లను గుర్తించినట్లు ఏఎస్ఐ సర్వేలో వెల్లడైందని హిందూపక్షం న్యాయవాది విష్ణుశంకర్జైన్ తెలిపారు. ఆలయం కింది భాగంలో హిందూ దేవతల విగ్రహాలను కూడా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారని వెల్లడించారు. 17వ శతాబ్దంలోనే ఆలయాన్ని కూల్చేసినట్లు ఏఎస్ఐ సర్వే నిర్ధారించిందని పేర్కొన్నారు.
ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించారని పురావస్తు శాఖ అధికారుల సర్వేలో తేలిందని హిందూపక్షం న్యాయవాది తెలిపారు. మసీదు దక్షిణ భాగంలోని గోడ.. హిందూ ఆలయానికి చెందినదే అని అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఆలయానికి సంబంధించిన శిల్పాలను కాస్త చెక్కి మళ్లీ మసీదు నిర్మాణంలో వినియోగించారని తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి 34 కీలక శాసనాధారాలు లభ్యమయ్యాయని చెప్పారు. జనార్ధన, రుద్ర, ఉమేశ్వర పేర్లతో ఈ శాసనాలు లభ్యమయ్యాయన్నారు. ఇవి దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నాయని తెలిపారు.
#WATCH | Varanasi, Uttar Pradesh | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side, gives details on the Gyanvapi case.
He says, “The ASI has said that during the survey, a number of inscriptions were noticed on the existing and preexisting structure. A total of 34… pic.twitter.com/fdBFeIsQAV
— ANI (@ANI) January 25, 2024