అమరావతి : సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన విధ్వంసానికి కారకులుగా అనుమానిస్తున్న మాచర్ల వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna reddy), అతడి సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం 144 సెక్షన్ నేపథ్యంలో గృహ నిర్బంధం ( House arrest) లో ఉన్న పిన్నెల్లి సోదరులిద్దరూ పోలీసులకు , అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా గన్మెన్ల (Gunmens) ను వదిలి వెళ్లడం చర్చాంశనీయంగా మారింది .
పిన్నెల్లి, అతడి సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లిన విషయాన్ని గన్మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం విషయం బయటకు పొక్కింది. గృహ నిర్బందంలో ఉండగా ఇంటి నుంచి ఎలా భయటకు వెళ్లారు అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలింగ్(Polling) రోజున మాచర్ల నియోజకవర్గంలోని రెండు పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ శ్రేణులుచొరబడి ఈవీఎం (EVMs) లను ధ్వంసం చేశారు.
పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న టీడీపీ వారిపై మారణయుధాలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. టీడీపీ అభ్యర్థి జాకంటి బ్రహ్మారెడ్డికి చెందిన కార్లను ధ్వంసం చేశారు. మాచర్ల జరిగిన విధ్వంసాన్ని తెలుసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి అభ్యర్థులను గృహనిర్బంధం చేయాలని ఆదేశించడంతో టీడీపీ, వైసీపీ అభ్యర్థులను గృహనిర్బందం చేశారు.
మరుసటి రోజు కారంపూడిలో వైసీపీ నాయకులు టీడీపీ (TDP) కార్యాలయానికి నిప్పంటించారు. వైసీపీ దాడులకు నియంత్రించేందుకు అక్కడికి వచ్చినా సీఐ నారాయణస్వామిపై దాడి చేశారు. ఈ ఘటనలపై సీఎస్, డీజీపీల నుంచి వివరణ కోరిన అనంతరం దాడులకు పాల్పడ్డ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో పిన్నెల్లి సోదరులు అరెస్టు బారి నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.