Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను జస్టిస్ గీతా గోపి (Justice Geeta Gopi) ధర్మాసనానికి గుజరాత్ హైకోర్టు కేటాయించింది. అయితే, ఈ కేసును తాను విచారించలేనని జస్టిస్ గీతా గోపీ తెలిపారు. ఈ మేరకు కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ కేసు విచారణను మరో బెంచ్కు బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ (court registry)ని ఆమె సూచించారు.
దీనిపై రాహుల్ తరపు న్యాయవాది పీఎస్ చపనేరి (PS Chapaneri) స్పందిస్తూ… రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను ముందుగా విచారణ జరపాలని జస్టిస్ గీతా గోపి ధర్మాసనానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆమె సూచించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణకు మరో జడ్జికి కేటాయించేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.
2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరే ఎందుకు ఉంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ రెండేండ్ల జైలు శిక్ష విధించింది. శిక్షను తాత్కాలింగా నిలిపివేస్తూ నేరారోపణకు వ్యతిరేకంగా నెల రోజుల్లోగా అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, కోర్టు శిక్ష నేపథ్యంలో రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read..
India Corona | 9 వేలకు పైనే కొత్త కేసులు.. 60 వేల దిగువకు యాక్టివ్ కేసులు
Bengal school | బెంగాల్ స్కూల్లో కలకలం.. తుపాకీతో క్లాస్ రూమ్లోకి ప్రవేశించిన వ్యక్తి
మెడికల్ డివైసెస్ పాలసీకి కేంద్రం ఆమోదం