న్యూఢిల్లీ : వైద్య పరికరాల తయారీ రంగాన్ని దేశీయంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం నేషనల్ మెడికల్ డివైసెస్ పాలసీకి బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆరు వ్యూహాలపై ఈ పాలసీ దృష్టిని సారించి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం 11 బిలియన్ యూఎస్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ రంగాన్ని రానున్న ఐదేండ్లలో 50 బిలియన్ యూఎస్ డాలర్లకు అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమన్నారు. దేశంలో వైద్య పరికరాలకు ఎంతో డిమాండ్ ఉన్నదని, దేశీయంగానే తయారీని చేపడితే ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడమే కాక విదేశీమారక ద్రవ్యం ఆదా ఆవుతుందని తెలిపారు.