India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 9 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry Of India) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,355 మందికి పాజిటివ్గా తేలింది. నిన్న ఒక్కరోజే 9,629 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లగా ఉంది.
ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలకు దిగువకు నమోదయ్యాయి. ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి నుంచి 4,43,35,977 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,424గా నమోదైంది.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని తెలిపింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశంలో ఇప్పటి వరకూ 220.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
KTR | పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
Bengal school | బెంగాల్లో స్కూల్లో కలకలం.. తుపాకీతో క్లాస్ రూమ్లోకి ప్రవేశించిన వ్యక్తి