జైపూర్ : కరోనాతో తండ్రి చనిపోయాడన్న వార్త ఆమెను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. నాన్న లేని లోకం ఎందుకు అనుకుందేమో ఆమె.. నాన్న చితి మంటపై దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో చోటు చేసుకుంది.
దామోదర్ దాస్ శార్దా(73) అనే వృద్ధుడు కరోనాకు బలయ్యాడు. దీంతో ఆయన ముగ్గురు కూతుళ్లు అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వచ్చారు. ముగ్గురిలో చిన్న కూతురు చంద్ర శార్దా.. నాన్న మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంత్యక్రియల సమయంలో నాన్న చితి మంటపై చంద్ర ఒక్కసారిగా దూకింది. నాన్న వెంటే తాను కూడా వెళ్లిపోతానని బోరుమన్నది. అప్రమత్తమైన బంధువులు.. చంద్రను చితి మంట నుంచి బయటకు లాగారు. 70 శాతం కాలిన గాయాలతో ఆమె జోధ్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి..