జిల్లాలోని దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు చేశాం
అందుబాటులో మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్
ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దు
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ఎస్వీఎస్ దవాఖానలోని కరోనా వార్డు పరిశీలన
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 25 : కరో నా రక్కసిని ఎదుర్కొనేందుకు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం.. మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్తోపాటు ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.. ప్రజలు ఆందోళన చెందొద్దని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ దవాఖానలో కరోనా వార్డును ఆయన పరిశీలించారు. ముందుగా అత్యవసర సేవల విభాగాన్ని సందర్శించారు. అనంతరం కరోనా వార్డును పరిశీలించి ఎంత మంది రోగులు ఉన్నారు..? వారికి చికిత్స ఎలా అందిస్తున్నారు..? ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉన్నాయా..? అని క్యాజువాలిటీ ఎమర్జెన్సీ మెడికల అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీలోని కరోనా మందులను పరిశీలించారు. మందులను సరఫరా ఎలా చేస్తున్నారని ఫార్మసీ ఇన్చార్జిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనాను ఎదుర్కొనేందుకు పాలమూరు జనరల్ దవాఖాన, ఎస్వీఎస్ దవాఖానలో ప్రభుత్వం తరుఫున కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో కూడా చాలినన్ని పడకలు, ఆక్సిజన్, మందులను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. నిర్ల క్ష్యం వహించకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించి వైరస్ను కట్టడి చేయాలన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో సేవలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్కు దీటుగా జిల్లాలో ఏర్పాట్లు ఉన్నాయని, ఎవరూ రాజధానికి వెళ్లాల్సిన పని లేదన్నారు. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, దవాఖానలోని కరోనా వార్డులో ఏర్పాట్లు బాగున్నాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కృష్ణ, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, ఎస్వీఎస్ పీఆర్వో కిరణ్ తదితరులు ఉన్నారు.