Rahul Gandhi | 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత (Disqualification) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాహుల్పై అనర్హత వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు సైతం తప్పుబట్టాయి. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాగా, ఈ అంశంపై తాజాగా జర్మనీ (Germany) స్పందించింది. ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని పేర్కొంది.
‘భారత్లో ప్రతిపక్ష నాయకుడు (Indian opposition politician) రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష, కోర్టు తీర్పుతో లోక్సభ సభ్యత్వం రద్దవడం వంటి పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం. మాకు తెలిసి.. రాహుల్ ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే స్థితిలో ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా, ఏ ప్రాతిపదికన అతనిపై అనర్హత పడిందన్నది స్పష్టమవుతుంది. ఈ కేసులో న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని మేం భావిస్తున్నాం’ అని జర్మనీ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.
Also Read..
India Corona | మూడు వేలు దాటిన కొత్త కేసులు.. 14 మంది మృతి
Google | గూగుల్కు ఎన్సీఎల్ఏటీ షాక్.. 30 రోజుల్లో 1,337 కోట్ల జమచేయాల్సిందే