న్యూఢిల్లీ, మార్చి 29: ప్రముఖ ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్కు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఏకో సిస్టమ్ కేసునకు సంబంధించి సీసీఐ విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాపై నేషనల్ కంపెనీ లా అప్పిలెట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన గూగుల్కు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది.
ఇద్దరు సభ్యులు కలిగిన ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం..ఈ జరిమానా మొత్తాన్ని వచ్చే 30 రోజుల్లో జమచేయాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్లో గూగుల్కు రూ.1,337 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే అనైతిక, వ్యాపార పద్దతులను మార్చుకోవాలని..తన ప్రవర్తనను మార్చుకోవాలని ఎన్సీఎల్టీ హితవు పలికింది. దీనిపై స్పందించడానికి గూగుల్ వర్గాలు నిరాకరించారు.