Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి హింస చెలరేగింది. గురువారం ఉదయం బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని మొరాంగ్ ప్రాంతంలో కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కాల్పుల ఘటన (gun shots) చోటు చేసుకుంది.
తాజా అల్లర్లతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ‘నిన్న రాత్రి నుంచి కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. మేము రాత్రంతా నిద్రపోలేదు. కొందరు ఆందోళనకారులు ఉదయం కొన్ని ఇళ్లకు నిప్పుపెట్టారు. భయంతో మేం సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నాం’ అని గ్రామస్థులు తెలిపారు.
Also Read..
Samantha | నాలుగు డిగ్రీల చలిలో.. సమంత ఐస్ బాత్
Cargo Ship | మంటల్లో 3000 కార్లు.. నడిసముద్రంలో ఫైర్ యాక్సిడెంట్
Movie Songs | పెళ్లిళ్లలో సినిమా పాటలు ప్లే చేయడం కాపీరైట్ కిందకు రాదు.. కేంద్రం క్లారిటీ