బీజేపీలో చేరిన భారత మాజీ క్రికెటర్

చెన్నై: భారత మాజీ క్రికెటర్, తమిళనాడు వాసి లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ భారతీయ జనతాపార్టీలో (బీజేపీ) చేరారు. తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సీటీ రవి.. లక్ష్మణ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డును అందజేశారు. లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ 1965, డిసెంబర్ 31న చెన్నైలో జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత క్రికెట్లో రాణించి తమిళనాడు రంజీజట్టులో ప్రవేశించారు. అనంతరం రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్గా భారత క్రికెట్ జట్టులోనూ చోటు సంపాదించారు. అనంతరం కామెంటేటర్గా, ఫీల్డ్ అంపైర్గా క్రికెట్ క్రీడకు తన సేవలు అందించారు.
Tamil Nadu: Former Indian cricketer Laxman Sivaramakrishnan joins Bharatiya Janata Party in Chennai. https://t.co/bE05u082hx pic.twitter.com/U5arZLrboQ
— ANI (@ANI) December 30, 2020
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్లోకి మారనున్న అనుష్క..!