Foreign Currency | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport)లో భారీగా విదేశీ కరెన్సీ (Foreign Currency) పట్టుబడింది. శుక్రవారం ఇస్తాంబుల్ కు వెళ్లే విమానం ఎక్కేందుకు వెళ్తున్న ముగ్గురు తజికిస్థాన్ జాతీయుల్ని ( Tajikistan nationals) కస్టమ్స్ (Customs) అధికారులు అడ్డుకున్నారు. వారి లగేజీని తనిఖీ చేయగా.. అందులో ఉన్న బూట్లల్లో దాచిన విదేశీ కరెన్సీని గుర్తించారు. వారి నుంచి మొత్తం రూ.10.6 కోట్లకు పైనే విదేశీ కరెన్సీ (7,20,000 అమెరికా డాలర్లు, 4,66,200 యూరోలు) ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
కాగా, భారత విమానాశ్రయాల్లో ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడటం ఇదే మొదటి సారి అని కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
In one of the biggest foreign currency seizures at airports in the country, AirCustoms@IGIA have booked a smuggling case against 3 Tajik nationals departing for Istanbul, after search of their bags led to recovery of US$ 720,000 & €664,200 valued at INR 10.07 Cr. pic.twitter.com/WewwenQ1m2
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) July 21, 2023
Also Read..
Manipur violence | మణిపూర్ అమానవీయ ఘటన.. ఐదో నిందితుడి అరెస్ట్
Manipur Violence | మణిపూర్ హింస.. మరో వీడియో వైరల్.. 6 వేల కేసులు నమోదు..!
Urfi Javed | విమానంలో ఉర్ఫీకి వేధింపులు.. పబ్లిక్ ఫిగర్ నే కానీ, పబ్లిక్ ప్రాపర్టీని కాదన్న నటి