Loksabha Elections 2024 : యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. పది లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా తాము కసరత్తు సాగిస్తున్నామని అన్నారు.
2005 నుంచి 2020 వరకూ 5 లక్షల ఉద్యోగాలను ఇచ్చామని గుర్తుచేశారు. 2020 తర్వాత ఏటా పది లక్షలకు పైగా ఉద్యోగాలు యువతకు కల్పించాలని నిర్ణయించుకున్నామని నితీష్ కుమార్ పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్లోని అరారియలో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2020 తర్వాత 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, మరో 3 లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని యువతకు నితీష్ కుమార్ భరోసా కల్పించారు.
Read More :
KCR | ఓయూలో తాగు నీటి, విద్యుత్ కొరత.. రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్