న్యూఢిల్లీ: గర్భాశయ క్యాన్సర్(Cervical cancer) నిర్మూలనే లక్ష్యంగా టీకా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఆ టీకాలు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. పార్లమెంట్లో ఇవాళ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ప్రసూతి, శిశు సంరక్షణ కోసం అనేక స్కీమ్లను ఒకే సమగ్రమైన ప్రోగ్రామ్ కిందకు తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు. ఇమ్యూనైజేషన్ కోసం కొత్తగా డిజైన్ చేసిన యూ-విన్ ప్లాట్ఫామ్ను కూడా వాడుకలోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు సంబంధించిన విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో ట్యాగ్ చేశారు.
Govt will encourage vaccination for girls in age group of 9-14 years for prevention of cervical cancer.
Various schemes for maternal & child care will be brought under one comprehensive program.
Newly designed U-win platform will be rolled out expeditiously. #ViksitBharatBudget pic.twitter.com/dM4WWcuIqc
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 1, 2024