న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి చిన్న ప్రమాదం జరిగింది. శనివారం ఆమె హెలికాప్టర్లోకి ఎక్కి కూర్చోబోతుండగా పట్టు తప్పి కింద పడ్డారు.
భద్రతా సిబ్బంది ఆమెకు సహాయం చేశారు. తర్వాత ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారు. దుర్గాపూర్ నుంచి అసనోల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.