China | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: డ్రాగన్ దేశం చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని షాక్స్గామ్ లోయ ప్రాంతంలో యథేచ్ఛగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది. దీనికి సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ చిత్రాలు తాజాగా వెలుగులోకి రావడంతో చైనా దురాగతం బయటపడింది. భారత్కు అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్కు సమీపంలో చైనా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం గమనార్హం. 2022, జూలై-2023, ఆగస్టు మధ్య ఈ రోడ్డు నిర్మాణం జరిగినట్టు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.
ఇది భారత్కు భద్రతాపరమైన సవాళ్లు విసిరే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు నిర్మాణం భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. షాక్స్గామ్లో నిర్మించిన ఈ రోడ్డును బల్టిస్థాన్ నుంచి తవ్వుకొన్న యురేనియం వంటి ఖనిజాల తరలింపునకు ఉద్దేశించిందని లెఫ్టినెంట్ జనరల్ శర్మ వంటి నిపుణులు పేర్కొన్నారు. అదేవిధంగా భారత్కు వ్యతిరేకంగా పాక్, చైనా సైన్యాలు సైనిక కుయుక్తులు పన్నేందుకు ఉన్న అవకాశాలపై నిరంతరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ద్వైపాక్షిక సరిహద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ పీవోకే భాగంగా ఉన్న ఈ షాక్స్గాయ్ లోయను పాకిస్థాన్ 1963లో చైనాకు ధారాదత్తం చేసింది. అయితే ఈ అప్పగింతను భారత్ గుర్తించలేదు.