Himachal Pradesh Floods | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో కురిసిన భారీ వర్షాలకు వరదలు (Floods) సంభవించాయి. మండి (Mandi) జిల్లాలోని బాగిపుల్ (Bagipul) ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో పర్యాటకులు, స్థానికులు సహా 200 మందికిపైగా ప్రజలు చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రశార్ సరస్సు (Prashar Lake) సమీపంలో వరదలు సంభవించాయని.. దీంతో టూరిస్టులు వరదల్లో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు.
‘మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో గల ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో పర్యాటకులు, స్థానికులు సహా 200 మందికిపైగా ప్రజలు ప్రశార్ రోడ్డులోని బగ్గీ వంతెన (Baggi Bridge) సమీపంలో చిక్కుకుపోయారు. చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు, పరాశర్ నుంచి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకుపోయాయి. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుంచి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, జాతీయ రహదారిని మూసేశాం. ఆ రహదారిని తిరిగి ప్రారంభించేందుకు కొంత సమయం పడుతుంది. అక్కడ చిక్కుకున్న వారు ఇతర మార్గాల ద్వారా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని డీఎస్పీ సూద్ వెల్లడించారు.
Himachal Pradesh | Heavy rainfall in Mandi district leads to landslide on Chandigarh-Manali highway near 7 Mile; causes heavy traffic jam pic.twitter.com/GfFtAcR9O5
— ANI (@ANI) June 26, 2023
Also Read..
Wrestlers | ఇకపై రోడ్డెక్కబోం.. కోర్టులో తేల్చుకుంటాం : రెజ్లర్ల కీలక నిర్ణయం
Odisha | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెండ్లి బస్సు.. పది మంది మృతి