హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ర్టానికి ‘పాంచ్ న్యాయ్’ పేరిట ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది. గాంధీభవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తెలుగులో ముద్రించిన ఎన్నికల ప్రణాళిక ‘ఐదు న్యాయాలు-తెలంగాణకు ప్రత్యేక హామీలు’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో యువత, రైతులు, మహిళలు, కార్మికులకు న్యాయం జరిగేలా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు వివరించారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.