హైదరాబాద్, మే3 (నమస్తే తెలంగాణ): మే 2న అచ్చయిన వ్యాసంతో వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ పూర్తవుతుందని భావించా. కానీ, మే 3న ఐదో భాగం కూడా రాసి ముగించారు. సంతోషం. అందులో కూడా వెదిరె వారికి కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరముందని భావించి ఈ వ్యాసం రాస్తున్నా. కాళేశ్వరంలో వినియోగమయ్యే విద్యుత్పై చాలా మందికి ఉన్నట్టే వెదిరెకు కూడా అనుమా నాలున్నాయని ఆయన రాతలే చెబుతున్నయ్. ఈ అంశంలో ప్రాజెక్టు వ్యతిరేకులు చేసిన ప్రచార వొరవడిలో వెదిరె కొట్టుకుపోయారని స్పష్టమవుతున్నది. గతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ వినియోగంపై విద్యుత్ రంగ నిపుణుడు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి వివరణలు ఇచ్చారు. ‘నిజం ఇంటి గడప దాటే లోగా అబద్ధం ఊరిని చుట్టి వస్తుంది’ అన్న చందంగా కాళేశ్వరం విద్యుత్ వినియోగంపై అబద్ధపు ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నయ్.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవరమయ్యే మొత్తం విద్యుత్తు వినియోగంపై గతంలో కొంత మంది తమ ఊహాగానాల లెకలతో ఎకరానికయ్యే విద్యుత్ వ్యయాన్ని లక్ష నుంచి లక్షా యాభై వేలుగా తప్పుడు లెకగట్టారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ కింద ఆయకట్టు రైతులు చేసేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యవసాయమని అన్యాయమైన వ్యాఖ్య చేసేశారు. వాస్తవమేమంటే ప్రాజెక్టు మొత్తం వినియోగం 13,558 మిలియన్ యూనిట్లుగా అంచనా వేశారు. అందులో 75శాతం అంటే 10,168.50 మిలియన్ యూనిట్లు మాత్రమే వాస్తవ వినియోగం. ఇప్పుడు ప్రపంచంలో తయారవుతున్న పంపులు 89-91శాతం ఎఫిషియన్సీ కలిగినవి. వాటి పవర్ ఫ్యాక్టర్ 0.95గా ఉంటుంది. కాబట్టి 10శాతం వరకు ప్రత్యక్షంగా విద్యుత్ వినియోగంలో సేవింగ్స్ ఉంటాయని విద్యుత్ రంగ నిపుణులు చెప్పేమాట. లింక్-1లో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికయ్యే కరెం టు ఖర్చు (ఫిక్డ్స్ చార్జీలు కలుపుకొని రూ.570.56 లక్షలు, ఎల్లంపల్లి – మిడ్ మానే రు లింక్-2లో రూ. 1207.43 లక్షలు, మిడ్మానేరు – మల్లన్నసాగర్ లింక్- 4లో రూ. 1558.23 లక్షలు, మల్లన్నసాగర్ – కొండపోచమ్మసాగర్ లింక్లో రూ. 451.91లక్షలు, మొ త్తంగా పై లింకులన్నీ కలిపితే మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఎత్తిపోతల ద్వారా ఎకరానికయ్యే ఖర్చు రూ. 37,881.55 మాత్ర మే.
ఈ ఖర్చు కూడా నాలుగు లింకుల్లో అన్ని పంపులు నిరంతరాయంగా 5 నెలల పాటు నడిచినప్పుడు మాత్రమే. కానీ, ఈ పరిస్థితి కాళేశ్వ రం ప్రాజెక్టులో ఎప్పుడూ ఉండబోదు. విద్యుత్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం వాస్తవ వినియోగం 50శాతం మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న 22 పంప్హౌసుల్లో వివిధ రేటింగ్ (139, 135, 125, 106, 44, 40 మెగావాట్లు) కలిగిన మొత్తం 85 పంపులుంటాయి. అవన్నీ ఒకేసారి నడిచినప్పుడు 4600 మెగావాట్ల కరెంటు అవసరమవుతుందని అంచ నా. వాస్తవ వినియోగం 80శాతం అనుకుంటే 3680 మెగావాట్లు. అయితే అన్ని పంపులు ఒకేసారి నడిచే సందర్భం అసలు ఏర్పడకపోవచ్చు. శ్రీరాంసాగర్కు వరద వస్తే గ్రావిటీ ద్వారానే మిడ్మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి నిండుతాయి. అప్పుడు లింక్ 1,2 లో పంపులు నడిపే అవసరం రాదు. మిడ్మానేరు నుంచే పంపులు నడుస్తాయి. శ్రీరాంసాగర్ వద్ద నీరు లేకున్నా ఎల్లంపల్లికి శ్రీరాంసాగర్-ఎల్లంపల్లి మధ్యన ఉన్న పరీవాహక ప్రాంతం నుంచి, కడెం ప్రాజెక్టు నుంచి వరద రావచ్చు. అప్పుడు లింక్-1లో పంపులు నడపరు. లింక్-2లో పంపుల ద్వారా మిడ్మానేరుకు, అకడి నుంచి కొండపోచమ్మసాగర్ వరకు, శ్రీరాంసాగర్కు నీటికి ఎత్తిపోస్తారు. ఆ రెండు చోట్లలో నీరు లేనప్పుడే మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోస్తారు. కాబ ట్టి కాళేశ్వరం ఎత్తిపోతల కరెంటు ఖర్చులు ఎకరానికి 1- 1.50 లక్షలు ఉంటుందని ప్రాజెక్టు వ్యతిరేకులు చేసే విమర్శలు నిరాధారం.
తెలంగాణలో ఎత్తిపోతలు లేకుండా రైతులకు సాగు నీరివ్వలేం. ఈ సంగతి వెదిరె సహా ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో కూడా దాదాపు ఇంతే కరెంటు వినియోగముంటుంది. ఆ ప్రాజెక్టుపై లేని అభ్యంతరాలు కాళేశ్వరంపై ఎందుకు? ఎత్తిపోతల పథకాల్లో పంపులు నడిస్తే కరెంటు కాలుతుంది. రాష్ట్రంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, నాగార్జునసాగర్ దిగువ కాలువ, కల్వకుర్తి, నెట్టెంపా డు, భీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల, భక్త రామదాసు, అలీసాగర్, గుత్ప, చౌటుపల్లి హనుమంతరెడ్డి, గూడెం, ఎల్లంపల్లి, దేవాదుల పథకాలు విజయవంతంగా రైతులకు సేవలందిస్తున్నాయి. 2019 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతున్నది. ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించగలిగితే మరో రెండు మూడేండ్లలో పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి, చిన్న కాళేశ్వరం, వార్ధా, చనాక కొరట, సంగమేశ్వర, బసవేశ్వర, చెన్నూరు ఎత్తిపోతల పథకాలు సాగునీరందించేందుకు సిద్ధమవుతాయి. వాటన్నింటికీ సుమారు 9-10 వేల మెగావాట్ల కరెంటు అవసరమని ఇంజినీర్ల అంచనా. వాటికి ఏటా 10-15 వేల కోట్ల కరెంటు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏ ప్రభుత్వానికైనా తప్పదు. తెలంగాణలో ఎత్తిపోతలు అనివార్యమైనప్పుడు కరెంటు ఖర్చులు తప్పవు కదా?. ఖర్చులు – ప్రయోజనాలు అన్న దృష్టి కోణంలో విశ్లేషిస్తూ కూర్చుంటే తెలంగాణ కూడా విదర్భలా రైతు ఆత్మహత్యలకు నిలయం గా మిగిలిపోయి ఉండేది. ఉమ్మడి రాష్ట్ర పాలకులు మీరు ఎత్తు గడ్డ మీద ఉన్నారు, మీకు నీళ్లు రావు’ అని దశాబ్దాల పాటు మన నీటిని తరలించుకుపోయారు. ఇప్పుడు కరెంటు ఖర్చుల బూచిని చూపిస్తూ వ్యవసాయ ఆర్థికవేత్తలు, ఇతర అంతర్జాతీయ నిపుణులు ఎత్తిపోతలు తెల్ల ఏనుగులని వర్ణిస్తున్నారు. వారికి వీరికి తేడా లేదు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సోయితో సాహసించి కాళేశ్వరం నిర్మించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ ఎత్తిపోతలను చేపట్టింది. పెండింగ్ ఎత్తిపోతలను వినియోగంలోకి తెచ్చింది. కరువు, వలసలు, రైతు ఆత్మహత్యలకు చెక్ పెట్టగలిగింది. కాళేశ్వం ప్రాజెక్టు తెలంగాణ కరువుపై జలాస్త్రంలా నిలిచింది.
మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు నదీ మార్గాన్ని ఎంచుకోవడాన్ని కూడా వెదిరె తప్పుపడుతున్నారు. కరెంటు ఖర్చు ఎకు వ అంటున్నారు. నది నుంచి లంబకోణంలో లోతట్టు ప్రాంతాలకు ఎత్తిపోసుకుంటే కరెంటు తకువ అవసరం పడేదంటున్నారు. లోతట్టు ప్రాంతాలకు ఎత్తిపోసుకోవడం ఏమిటో అర్థంకాలేదు. మొదట మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేరుకే నీటిని ఎత్తిపోసుకునే ఆలోచన చేశా రు. ఆ మార్గమంతా సింగరేణి బొగ్గు గనులు, రామగుండం పారిశ్రామిక ప్రాంతాలు ఉండడం తో అది వాంఛనీయం కాదని విశ్రాంత ఇంజినీర్ల సంఘమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అప్పుడు నదీ మార్గాన్నే ఎంచుకోవడం బహుళ ప్రయోజనాల రీత్యా ఉత్తమమైన ప్రత్యామ్నాయమని భావించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు సుమారు 170 కిలోమీటర్ల పొడవునా గోదావరి సజీవమై ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అనూహ్యంగా పెరిగాయి. పర్యావరణం, జీవావరణం ఇంతకు ముందెన్నడూ లేనంతగా మెరుగుపడ్డాయి. దేశీయ జలరవాణాకు మార్గం ఏర్పడింది. ఎకో, టెంపుల్ టూరిజానికి ఆవకాశాలు మెరుగయ్యాయి. అతితకువ ముంపుతో 34టీఎంసీల నీటిని నదిలోనే నిల్వ ఉంచే వీలు కలిగింది.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ పనులు చేపట్టడంపై అందరికీ ఉన్నట్టే వెదిరెకు కూడా అపోహాలున్నాయని తెలుస్తున్నది. కేసీఆర్ ఈ పనులు చేపట్టడంలో చాలా ముందు చూపు ఉన్నదన్న సంగతిని మేధావులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు విషయమేమంటే 87 బిలియన్ డాలర్ల వ్యయంతో దేశంలోని 60నదులను ఇతర నదులతో అనుసంధానం చేయాలని 2017లో ప్రధాని మోదీ ప్రణాళిక సిద్ధం చేశారు. ఉత్తరాది నదులైన కెన్-బెత్వా నదుల అనుసంధానం పనులను కూడా మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. గోదావరి నీళ్లను కృష్ణా, పెన్నా బేసిన్ల ద్వారా కావేరి బేసిన్కు తరలించేందకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ అంశాన్ని కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారు. ఒకసారి గోదావరి-కావేరి అనుసంధాన పనులు మొదలైతే తెలంగాణ తన వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హైడ్రాలజీ క్లియరెన్స్లు పొందడం కష్టమవుతుంది. మన వాటా జలాల వినియోగానికి అవసరమైన ప్రాజెక్టులు నిర్మించకముందే పెన్నా-కావేరి బేసిన్లో గోదావరి జలాల వినియోగం ప్రారంభమైతే వారికి ముందుగా రైపేరియన్ రైట్స్ (నదీతీర హక్కులు) ఈ నీటిపై లభిస్తాయి.
ఈ పరిస్థితి రా కముందే మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడం కాళేశ్వరంలో మొదలైతే మన వాటా జలాలపై ముందుగా రైపేరియన్ రైట్స్ తెలంగాణకు దక్కుతాయి. ఈ కారణంతోనే కేసీఆర్ మూడో టీఎంసీ కోసం పదేళ్లుగా తన ప్రణాళికను అమలు చేశా రు. వ్యాప్కోస్ ఇచ్చిన మేడిగడ్డ ఇతర బరాజ్ల నివేదికల్లోనే మూడో టీఎంసీ కోసం సివిల్ వర్క్స్, ఇతర పనుల ప్రస్తావన ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్లో కూడా మూడో టీఎంసీ గురించి ప్రస్తావించారు. ఇది ఆకస్మాత్తుగా 2020లో వచ్చిన ఆలోచన కాదు. 2016 ఆగస్టులో ఏజెన్సీలతో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లో కూడా మూడో టీఎంసీ సివిల్ వర్క్స్, పంపుల గురించి ఉన్నది. మూడో టీఎంసీ ఎందుకు అవసరమో మరో కారణం కూడా ఉన్నది. 2015 తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫడ్నవీస్ వేన్గంగా, వార్ధా జలాలను తమ రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు (విదర్భ)కు మళ్లించే ఆలోచన చేశారు. అవి కార్యరూపం దాల్చితే ప్రాణహితలో వరద తగ్గుతుంది. వానకాలంలో భారీగా వరదనీరు వచ్చే సందర్భంలోనే రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. ఆ నీటిని మల్లన్నసాగర్, ఇతర రిజర్వాయర్లలో నింపుకొని కాళేశ్వరం ద్వారా పూర్తిస్థాయి కొత్త, స్థిరీకరించే ఆయకట్టు సుమారు 40లక్షల ఎకరాలకుపైగా నీరందించే అవకాశముంటుంది.
గోదావరి బేసిన్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలని ఓ వైపు ఏపీ అంగీకరించలేదు. మరోవైపు తన వాటా 775 టీఎంసీలని పేర్కొంటున్నది. గోదావరి జలాల్లో వా టాలు తేల్చేందుకు ట్రిబ్యునల్ వేయాలని ఇప్పటికే ఏపీ డిమాండ్ చేస్తున్నది. ఇది ఎప్పటికైనా ఏర్పడే అవకాశముందన్న సంగతి కేసీఆర్ గ్ర హించారు. గోదావరి జలాల్లో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 968 టీఎంసీల నికరజలాలపై, గోదావరిలో వానకాలం లభ్యమయ్యే అపారమైన వరద జలాలపై తెలంగాణ హకులను ట్రిబ్యునల్ ఏర్పడక ముందే స్థిరపరిచే దిశగా ముందు చూపుతోనే మూడో టీఎంసీ పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వ చొరవతో 968 టీఎంసీల నికర జలాల్లో ఇప్పటికే 933 టీఎంసీలకు కేంద్ర జల సంఘం నుంచి హైడ్రాలజీ క్లియరెన్సులు పొందడం విశేషం. ఈ ముందు చూపునకు కృష్ణా బేసిన్లో మనకున్న అనుభవాలే ఆధారం. నాడు బచావత్ ట్రిబ్యునల్ ముందే వినియోగంలో ఉన్న నీటికి రక్షణ కల్పించిన కారణంగా బేసిన్ పేరామీటర్లలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉన్నా పెద్ద వాటా సాధించుకోగలిగింది. బచావత్ ట్రిబ్యునల్ గడువు 2000 మార్చితో ముగిసిపోతుందని అన్ని రాష్ర్టాలకు ముందే తెలుసు కాబట్టి కొత్త ట్రిబ్యునల్ ముందు తమ నీటి హకులను స్థిరపరచుకునేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు అధిక ప్రాధాన్యతనిచ్చి, నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా వరద జలాలపై ఆధారపడ్డ రాయలసీమ ప్రాజెక్టులను ఆగమేఘాలమీద పూర్తి చేసింది. తెలంగాణలో ఎత్తిపోతలు ప్రారంభమైనా అవి పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. కృష్ణా ట్రిబ్యునల్ అనుభవాల నుంచే కేసీఆర్ ప్రభుత్వం గోదావరి బేసిన్లో నీటి హకులను స్థిరపరచుకునే ఆలోచనతో మూడో టీఎంసీ పనులు చేపట్టి సమగ్ర డీపీఆర్ను కేంద్ర జలసంఘం ఆమోదానికి పంపింది. రాజకీయ కారణాలతో దానిన పకన బెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మూడో టీఎంసీ పనులు వెదిరె లాంటి విశ్లేషకులకు అనవసరమైనవి కనిపిస్తాయి. నా లాంటి వారికి గో దావరిలో నీటి హకులు స్థిరపరిచే ముందు చూపు కనిపిస్తుంది.
2014 తర్వాత జాతీయ ప్రాజెక్టు ఇచ్చే పథకం ఏదీ కేంద్ర ప్రభుత్వంలో లేదని వెదిరె చెబుతున్నారు. ఇదే విషయాన్ని నాటి కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడరీ కూడా పార్లమెంట్లో ప్రకటించిన సంగతిని పత్రికలు రిపోర్ట్ చేశాయి. అయినా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కోర్టు వివాదాల్లో ఉన్నా కర్ణాటక రాష్టానికి చెందిన అప్పర్భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి త్వ శాఖ హైపవర్ కమిటీ సిఫారసు చేయడం, కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం, 2023 కేంద్ర బడ్జెట్లో ప్రాజెక్టుకు రూ.5వేల కోట్లు కేటాయించడం, కర్ణాటకలో ఓటమి పాలు కాగానే ఏవో కారణాలు చెప్పి జాతీయ హోదా వెనకి తీసుకున్న సంగతి అందరికీ తెలుసు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు చేయలేదని, పెట్టుబడి అనుమతులు పొందలేదని, ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని వెదిరె చెబుతున్నారు. సాంకేతికంగా అది నిజమే కావచ్చు. ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి లభించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి పెట్టుబడి అనుమతుల కోసం రెండేళ్లు ప్రాజెక్టు ఇంజినీర్లు శ్రమించారు. వారికి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి కొర్రీలు రాస్తూ పోయారే తప్ప అనుమతిపై పురోగతి ఏమీ లేదు. ఆ లోపు రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులను సమీకరించుకుంది. పెట్టుబడి అనుమతిని ఇవ్వదలుచుకోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖది తప్పు కానీ నాకు తెలిసి తెలంగాణ ప్రభుత్వ లోపం ఏమీ లేదు.
తన వాటా నీటి హకులు స్థిరపడేదాకా తెలంగాణ సహా ఏ రాష్ట్రం కూడా అనుసంధానికి ఒప్పుకోదు. ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో, ఇప్పుడు కూడా ఎన్డబ్ల్యూడీఏకి తెలియజేసినట్లు పత్రికల్లో సమాచారం వస్తూనే ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా గోదావరి- కావేరీ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ-సమ్మక బరాజ్ల మధ్య ఇచ్చంపల్లి బరాజ్ ప్రతిపాదన వస్తున్నది. ఇచ్చంపల్లి నిర్మాణంతో ఈ రెండింటిపై ఏ రకమైన ప్రభావాలు ఉంటాయన్న సంగతి తేల్చేందుకు అధ్యయనం చేయాలనడం తప్పా? కిందనున్న దేవాదుల, సమ్మక, సీతారామ ప్రాజెక్టులకు ఉన్న కేటాయింపులను వినియోగించుకునేందుకు ఆపరేషన్ ప్రొటోకాల్ తయారైందా? అన్న ప్రశ్న తప్పేలా అవుతుంది. ముఖ్యంగా రబీకి నీటిని వదలాలని కేంద్రాన్ని అడుకునే పరిస్థితి ఏర్పడుతుందన్న అనుమానాలను నివృత్తి చేయాలా వద్దా? అనుసంధానం ద్వారా తరలించే 147 టీఎంసీల నీటిలో 50 శాతం అంటే 73 టీఎంసీల నీరు తెలంగాణకు కేటాయించే అవకాశముందని వెదిరె చెబుతున్నా, తాజాగా రాష్ర్టాలకు పంపిన డీపీఆర్లో తెలంగాణ వాటా 44 టీఎంసీలేనని పేరొన్నారని పత్రికల్లో వార్తలొచ్చాయి. టాస్ఫోర్స్ ఛైర్మన్గా వెదిరె ఈ విషయంపై స్పష్టతనివ్వాలి. నదుల అనుసంధాన ప్రాజెక్టు టాస్క్ఫోర్స్ ఛైర్మన్గా కీలక బాధ్యతల్లో ఉన్న వెదిరె, తెలంగాణ బిడ్డగా తన హోదా, పరపతిని ఉపయోగించి గోదావరి బేసిన్లో పెండింగ్ డీపీఆర్లు అన్నింటికీ త్వరగా క్లియరెన్స్లు ఇప్పించాలి. ఇవి ఆయనకు కష్టమైన పనులని నేను భావించడం లేదు.
– వరదాయిని కాళేశ్వరం
ఆంధ్రజ్యోతిలో వెదిరె శ్రీరాం రాసిన కాళేశ్వరంపై వ్యాసాలకు
వీ ప్రకాశ్ కౌంటర్