KTR | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): అస లు దేశంలో ఎన్నికల సంఘం ఉన్నదా?.. ప్రధాని మోదీ చట్టానికి అతీతులా? అని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ చూస్తుందంటూ, దళితులు, ఓ బీసీల రిజర్వేషలను జిహాదిలకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికలు స్వే చ్ఛగా జరుగాలని భావించే ఈసీ ఇటువంటి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఎక్స్ వేదికగా ప్ర శ్నించారు.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మా ట్లాడుతున్న ప్రధానిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తాము భేటీ బచావో.. భేటీ పడావో పథకాన్ని తీసుకొచ్చామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని, కానీ దేశంలో జరుగుతున్న అకృత్యాలు ఆ ప్రభుత్వానికి కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు.