MLC Jeevan Reddy | ఆర్మూర్టౌన్, మే 3: నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్రెడ్డి. ఓ మహిళ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్, చేపూర్, పిప్రి గ్రామాల్లో జీవన్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి ఓ మహిళా కూలీతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె వినయ్రెడ్డిని ఉద్దేశిస్తూ ‘మొన్న ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేసిన’ అని చెప్పింది. అప్పటికే ఆమె చెంప తడుతూ ఉన్న జీవన్రెడ్డి ఒక్కసారిగా ఛెళ్లుమనిపించారు. దీంతో విస్తుపోయిన ఆ వృద్ధురాలు, క్షణాల్లోనే తేరుకొని తననుతాను సంభాళించుకున్నది. ‘నాకు పింఛినయితే ఇవ్వండి సారు..’ అంటూ చేతులు జోడించి ఆమె వేడుకోగా, ‘వెళ్లి ఎమ్మెల్యే రాకేశ్రెడ్డిని అడుగు’ అంటూ వినయ్రెడ్డి విసుగ్గా చెప్పడం వీడియోలో కనిపించింది.
నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కండకావరం
ఎన్నికల ప్రచారంలో మహిళపై చెయ్యి చేసుకున్న జీవన్ రెడ్డి 😡
ప్రభుత్వం రాగానే ఎందుకంత అహంకారం?
ఉపాధి కూలీ మహిళను చెంప దెబ్బ కొడతారా?
బీజేపీ అభ్యర్థి అరవింద్ అహంకారానికి మీరేమి తీసిపోరేమో జీవన్ రెడ్డి గారు.… pic.twitter.com/4DEqcGouBw— BRS Party (@BRSparty) May 3, 2024