International Day Against Drug Abuse | విద్యానగర్, జూన్ 25: మాదక ద్రవ్యాలకు యువత బానిసవుతున్నది. చిన్న వయసులోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నది. మారుమూల ప్రాంతాల్లో గంజాయి భూతం జడలు విప్పుతున్నది. విద్యార్ధుల జీవితాలను మత్తులో ముంచేస్తున్నది. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న గంజాయి మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నది. డ్రగ్స్కి అలవాటుపడ్డవారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతున్నారు. సన్నిహితులకు దూరంగా గడుపుతూ, తరచూ ఉద్రేకానికి లోనవుతుంటారు. డ్రగ్స్లో అనేక రకాలుంటాయి. ముక ద్వారా పీల్చేవి, నోటితో, ఇంజెక్షన్ల రూపంలో తీసుకునేవి. పొగపీల్చేవి. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కాలేజీ, పాఠశాలల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆరా తీయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా, నేడు (సోమవారం) మాదక ద్రవ్యాల నిరోదక దినోత్సవం. ఈ సందర్భంగా డ్రగ్స్ వాడకంతోనే దుష్పరిణామాలు, వచ్చే జబ్బులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్), రిహబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి పలు విషయాలు వెల్లడించారు.
మాదక ద్రవ్యాలతో ప్రమాదకర జబ్బులు
మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలు తీసుకుంటున్న వారిలో ఎకువ శాతం మంది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచం పడుతున్నారు. మత్తు పదార్థాలు సరదా కోసం అలవా టు చేసుకొని వాటికి బానిస లై అతిచిన్న వయసులోనే వృ ద్ధులుగా కనిపించేవారు కొం దరుంటే, ఇంకొంత మంది జీవచ్ఛవాల్లా కాలం గడుపుతున్నారు. 30 సంవత్సరాల క్రితం యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లడం అరుదుగా ఉండేది. నేడు మత్తుపదార్థాలు సేవించే వారిలో 15-50 సంవత్సరాల్లోపు వారు ఎకువగా ఉంటున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. కొందరు యువకులు మత్తుకు అలవాటుపడతారు. అదేదో కొత్తగా, ఆనందంగా ఉంటుందనే నెపంతో గంజాయికి బానిసవుతున్నారు. మద్యంతో వచ్చే మత్తు కంటే రెండింతలు ఎకువగా ఉంటుందని, అదో కొత్త కికు అంటూ కొత్తవారిని అటువైపు తీసుకెళ్తుంటారు. కాగా, గంజాయికి అలవాటుపడిన యువకులు మిగతావారితో పోలిస్తే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు.
తల్లిదండ్రులు గమనిస్తుండాలి..
పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు, ప్రేమ, ఇతర విషయాల్లో కలత చెందినప్పుడు యువకులు మాదక ద్రవ్యాల వైపు మొగ్గుచూపుతారు. అలాంటివారి ప్రవర్తన ఇంట్లోనూ వేరే విధంగా ఉంటుంది. ఒంటరిగా ఉండడం, తాను ఉండే గదికి లోపలి నుంచి గొలుసుపెట్టుకొని గంటల తరబడి ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, నేరుగా కళ్లలోకి చూడకుండా పకలకు చూస్తూ మాట్లాడడం లాంటివి చేస్తుంటారు. గంజాయి తాగేవారి కళ్లు మిగతావారికి భిన్నంగా, కాస్త ఎరుపు రంగులో ఉంటాయి. వీరు ఒంటరిగా ఉండడానికి ఎకువగా ఇష్టపడతారు. మాట్లాడేటప్పుడు కాస్త తడబడుతూ ఉంటారు. శుభ్రతపై మకువపోయి, మాసిన దుస్తులతో తిరుగుతుంటారు. కనీసం గడ్డం కూడా చేయించుకోరు.గతంతో పోలిస్తే పాకెట్ మనీ ఎకువ కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తడి చేస్తుంటారు. ఈ విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
గంజాయితో నష్టాలు అనేకం..
గంజాయి పీల్చాక విచక్షణ కోల్పోతారు. వాహనం నడపడంలోనూ ఎంతో తేడా ఉంటుంది. విచక్షణ, సమయ స్ఫూర్తి లోపించి ప్రమాదాలకు లోనవడమే కాకుండా ఇతర వాహన చోదకులు, పాదాచారుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తారు. గంజాయి పీల్చే వారి మానసిక స్థితి క్రమేణా అధ్వానం అవుతుంది. గంజాయి ఊపిరితిత్తుల క్యాన్సర్కు ( లంగ్ క్యాన్సర్ ) హేతువు. బాగా పట్టు బిగించి గంజాయి దమ్ము లాగే వారి ఊపిరితిత్తులు, వారి జీవితాలనూ బలితీసుకుంటుంది.
వ్యంధత్వం ముప్పు అధికం..
చాలా కాలం గంజాయి, డ్రగ్స్ తాగే పురుషు ల్లో శుక్ర కణాలు (స్పెర్మ్ కౌంట్) తగ్గి పోతాయి. వారు తండ్రులు కాలేక పోవడం, స్త్రీల్లో అండా లు తగ్గి వారు గర్భం దాల్చకపోవడం వంటి స మస్యలు ఏర్పడుతాయి. గంజాయి పీలిస్తే ది వ్యాంగ శిశువుల జననం, అవయవ లోపాలతో శిశువులు పుట్టే ప్రమాదాలు ఎకువ అవుతాయి.