Rahul Gandhi | పరువునష్టం (Defamation) కేసులో సూరత్ కోర్టు తీర్పుతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవడంపై (disqualification as MP) కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇలాంటి కేసులో గరిష్ఠ శిక్ష (maximum sentence for defamation) ఎదుర్కొన్న మొదటి వ్యక్తిని తానే కావొచ్చంటూ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ (Stanford University )ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడిగా తన పరిచయంపై రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్షను ఎదుర్కొన్న మొదటి వ్యక్తిని నేనే కావొచ్చు. 2004లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడు ఊహించనేలేదు ఇప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయని’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే తనపై అనర్హత వేటు పడటం కూడా ఒకందుకు మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ జోడో యాత్రను ఉద్దేశిస్తూ.. పార్లమెంట్లో కూర్చోవడం కంటే ‘పెద్ద అవకాశం’ లభించిందని చెప్పారు. ‘భారతదేశంలో ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. వ్యవస్థలన్నింటినీ బీజేపీ తన గుప్పిట్లోకి తీసుకుంది. మేం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాం. వ్యవస్థలేవీ మాకు సాయం చేయలేదు. అందుకే రోడ్లపైకి వచ్చాం. దాని ఫలితమే ‘భారత్ జోడో యాత్ర’’ అని రాహుల్ పేర్కొన్నారు.
Also Read..
Tanay Pratap | ఐపీఎల్ చూడటమంటే సమయాన్ని వృధా చేసుకోవడమే : స్టార్టప్ ఫౌండర్
Mukesh Ambani | రెండోసారి తాతైన ముకేశ్ అంబానీ.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన శ్లోకా మెహతా
Rahul Gandhi | అమెరికాలో రాహుల్కు నిరసన సెగ.. కాంగ్రెస్ నేతకు వ్యతిరేకంగా నినాదాలు