Jan Shatabdi Express | దేశంలో మరో రైలుకు పెను ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ – హౌరా జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు (Jan Shatabdi Express train)లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి (Fire breaks). అయితే, అదృష్టవశాత్తు వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి హౌరా (Bhubaneswar-Howrah) వెళ్తున్న జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు (Jan Shatabdi Express train) గురువారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కటక్ ( Cuttack) చేరుకోగానే మంటలు చెలరేగాయి. కోచ్ దిగువ భాగం నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. అనంతరం రైలు 7:15కి కటక్ నుంచి బయలుదేరి వెళ్లినట్లు వివరించారు.
Also Read..
Revanth Reddy | మరికాసేపట్లో రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న కాంగ్రెస్ పెద్దలు
Kerala Doctor | అధిక కట్నం డిమాండ్.. యువ వైద్యురాలు ఆత్మహత్య
Cinema News | గర్ల్ఫ్రెండ్గా యువతరం కలలరాణి.. ఎవరా సుందరి?