Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులుగా (Cabinet Ministers) ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో వారికి రేవంత్ రెడ్డే స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం వారు నగరంలోని తాజ్ కృష్ణ హోటల్కు చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా నగరానికి చేరుకున్నారు.
ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం హాజరుకానున్నారు. వారిలో కొందరు ఇప్పటికే నగరానికి చేరుకోగా.. మరికొందరు హైదరాబాద్ బాటపట్టారు.
#WATCH | Telangana | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi and General Secretary Priyanka Gandhi Vadra arrive at a hotel in Hyderabad.
They are here in the city for the swearing-in ceremony of CM-designate Revanth Reddy. pic.twitter.com/InXy1sM4yI
— ANI (@ANI) December 7, 2023
#WATCH | Telangana | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi and General Secretary Priyanka Gandhi Vadra arrive in Hyderabad for the swearing-in ceremony of CM-designate Revanth Reddy.
The CM-designate and state Congress president received… pic.twitter.com/m4A9JNmwXM
— ANI (@ANI) December 7, 2023
మంత్రులుగా ప్రమాణం చేసేది వీరే..
మరో రెండు గంటల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపా మరో 11 మంది మంత్రులుగా (Cabinet Ministers) ప్రమాణం చేస్తారు. ఈ మేరకు గవర్నర్ తమిళసైకి మంత్రుల జాబితాను పంపించారు. వారిలో ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భట్టి విక్రమార్క, పొగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఉపముఖ్యమంత్రిగా ఒక్కరిని మాత్రమే నియమిస్తారని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్తో పోటీపడిన మల్లు భట్టివిక్రమార్కను డిప్యూటీ సీఎంగా చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇక సీఎం పదవి కోసం చివరివరకు ప్రయత్నం చేసిన మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
Also Read..
Kerala Doctor | అధిక కట్నం డిమాండ్.. యువ వైద్యురాలు ఆత్మహత్య
Vivek Ramaswamy: రిపబ్లికన్ డిబేట్లో వివేక్ రామస్వామి దూకుడు
Amy Aela | చెంగావి రంగు చీరలో కైపెక్కిస్తున్న అమీ ఏలా..