Kerala Doctor | కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కాబోయే భర్త ఇంటివారు అధిక కట్నం డిమాండ్ చేయడంతో ఓ యువ వైద్యురాలు (Kerala Doctor) బలవన్మరణానికి (suicide) పాల్పడింది.
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో (Thiruvananthapuram Medical College) సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా (26)కు తన స్నేహితుడు, మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధితో వివాహం నిశ్చయమైంది. అయితే, అబ్బాయి కుటుంబం బంగారం, భూమి, బీఎమ్డబ్ల్యూ కారు రూపంలో భారీ కట్నాన్ని డిమాండ్ చేశారు (dowry demand). అంత కట్నం ఇచ్చుకోలేమని సహానా కుటుంబం చెప్పడంతో వారు సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన సహానా ఇన్స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడింది.
మెడికల్ కాలేజీ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. మరోవైపు సహానా మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. పీజీ వైద్యురాలి ఆత్మహత్యపై సరైన విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా.. మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ అడ్వకేట్ సతీదేవి పరామర్శించారు. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి నివేదిక కోరారు. అధిక కట్నం డిమాండ్ చేసిన వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ తమ సంస్థలోని అన్ని బాధ్యతల నుంచి వరకట్న డిమాండ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని తొలగించింది.
Also Read..
Shooting | యూఎస్ వర్సిటీలో కాల్పులు.. దుండగుడు సహా ముగ్గురు మృతి
Chennai: వరద నీటిలో చెన్నై.. కొనసాగుతున్న రిలీఫ్ ఆపరేషన్స్
Skin Care | ఇలా చేస్తే చలి నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు!