రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఆ రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకుగాను 20 స్థానాలకు ఈ నెల 7న తొలి విడత పోలింగ్ నిర్వహించారు. మిగతా 70 స్థానాలకు శుక్రవారం రెండో విడత పోలింగ్ జరుగుతున్నది. అంబికాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్మోహినీ దేవి బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు.
ఓటు వేయడానికి ముందు మహామాయాదేవి ఆలయంలో డియో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ గెలిస్తే మీరు సీఎం రేసులో ఉంటారా..? అన్న ప్రశ్నకు లేదని చెప్పారు. మా ఇద్దరి (సీఎం భూపేష్ బఘేల్, డిప్యూటీ సీఎం డియో) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ పడుతున్నదని తెలిపారు.
#WATCH | Ambikapur: Chhattisgarh Deputy CM and Congress candidate from Ambikapur, TS Singh Deo casts his vote at a polling booth in Rajmohini Devi Girls College. pic.twitter.com/TV2awQRSOS
— ANI (@ANI) November 17, 2023